పళ్లకు సంబంధించిన అపోహలు... వాస్తవాలు

పన్ను తీయించుకుంటే కంటి చూపు మందగిస్తుంది. :కంటికి, పంటికి ఏవిధమైన సంబంధం లేదు. అదే నిజమైతే వివిధ రకాల దంత సమస్యలతో పళ్లు పీకించుకున్నవారికి అంధత్వం వచ్చి ఉండేది కదా. 

- గార పంటికి బలం. స్కేలింగ్ ద్వారా దాన్ని తొలగించాక పన్ను బలహీనమైనట్లు అనిపిస్తుంది.: ఇది పూర్తిగా తప్పు. గార కింద పెరిగే ఎన్నోరకాల బ్యాక్టీరియా... చిగుళ్ల వ్యాధికి కారణమవుతాయి. అందుకే ఆరునెలలకు ఒకసారి గారను దంతవైద్యుడి సహాయంతో తొలగింపజేసుకోవాలి. 

- పళ్లు శుభ్రం చేసే స్కేలింగ్ వల్ల పళ్లు లూజ్ అవుతాయి: ఇది నిజం కాదు. పళ్ల చుట్టూ గార తొలగిస్తే చిగుళ్ల వ్యాధి దూరమై పళ్లు పటిష్టమవుతాయి. 

- పిప్పి పంటికి పంటిలో దూరే ఒక రకం పురుగు కారణం: పిప్పి పన్ను ఏర్పడటానికి బ్యాక్టీరియా కారణం. చక్కెర, పిండిపదార్థాలతో కలిసి ఏర్పడే ఆమ్లం (యాసిడ్) వల్ల పళ్లు పుచ్చిపోతాయి. 

- పిప్పి పళ్లు ఉండి పంటి నొప్పి లేకుండా ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లవలసిన అవసరం లేదు: పంటి నొప్పి వచ్చేవరకు నిరీక్షించడం సరికాదు. ఎందుకంటే పంటి నొప్పి అన్నది పంటిలోపల ఉండే మూలం (పల్ప్) దెబ్బతినడం వల్ల వస్తుంది. అప్పుడు సాధారణ ఫిల్లింగ్‌కు బదులు రూట్‌కెనాల్ చికిత్స వంటివి అవసరమవుతాయి. అదే నొప్పిలేని దశలోనే డాక్టర్‌కు చూపిస్తే శ్రమ, ఖర్చు... రెండూ తగ్గుతాయి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top