మామూలు బియ్యం కంటే దంపుడు బియ్యమే ఎందుకు ఆరోగ్యకరం?

ముడిబియ్యంతో వండిన అన్నం తిన్నప్పుడు అందులో చాలా భాగం పీచు ఉంటుంది. దాంతో అంతే పరిణామంలో సాధారణ బియ్యంతో వండిన అన్నంతో పోలిస్తే ముడిబియ్యం అన్నం నుంచి విడుదల అయ్యే చక్కెరపాళ్లు తక్కువ. అదే సాధారణ బియ్యంలోనైతే (పరిమాణం అంతే అయినా) రక్తంలోకి విడుదలయ్యే చక్కెర పాళ్లు ఎక్కువ. అవి పూర్తిగా ఉపయోగపడకపోతే శరీరంలో పేరుకునే కొవ్వు పాళ్లూ ఎక్కువే. అందుకే డయాబెటిస్ ఉన్నవారు సాధారణ బియ్యం కంటే ముడిబియ్యం తినడం మంచిదని న్యూట్రిషనిస్ట్‌లు చెబుతుంటారు. 

పెన్ స్టేట్ యూనివర్సిటీ (పెన్సిల్వేనియా) అధ్యయనం ప్రకారం... అంతే మొత్తంలో ముడిబియ్యంతో వండిన అన్నాన్ని, సాధారణ బియ్యంతో వండిన అన్నాన్ని తిన్నవారిని పరిశీలిస్తే... ముడిబియ్యంతో వండిన అన్నం తిన్నవారిలో కంటే సాధారణ బియ్యంతో వండిన అన్నం తిన్నవారిలో 2.4 రెట్లు కొవ్వు పేరుకుంటుందని తేలింది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top