తల్లిదండ్రులు పిల్లల్లో ఆరోగ్యకర ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం తప్పనిసరి అని సూచిస్తున్నారు...
ఉదయపు అల్పాహారాన్ని తప్పనిసరిగా తీసుకునేలా చూడాలి. ఈ ఆహారం మేధోప్రదర్శనలో కీలకం.
భోజనంలో పంచదార, ఉప్పు, కొవ్వు పదార్థాలను తగ్గించడం ద్వారా ఊబకాయం సమస్య తలెత్తదు.
పండ్ల రసాల కన్నా పండ్లు తినడాన్ని ప్రోత్సహించాలి.
పంచదార కలిపిన పానీయాలు, శీతలపానీయాలు బాగా తగ్గించాలి. తగినన్ని నీరు, పాలు, పాల ఉత్పత్తులు తీసుకోమని చె ప్పాలి.
అధిక బరువు, తక్కువ బరువు రెండూ డిప్రెషన్, థైరాయిడ్ సమస్యలకు చేరువ చేస్తున్నాయని వివరించాలి.
రోజులో ఒక్కసారైనా కుటుంబం అంతా కలిసి భోజనం చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీని వల్ల పిల్లలు ఆరోగ్యకరమైన భోజనం చేసే వీలుంటుంది.
పిల్లలకు ఆరోగ్యపు ఆహార అలవాట్లను పరిచయం చేయడానికి పోషకాహార నిపుణులను సంప్రదించి వారిచేత కౌన్సెలింగ్ ఇప్పించడంలో జాప్యం కూడదు.
|