జోషిమఠ్ ప్రాధాన్యం ఏమిటి? అది ఎక్కడ ఉంది?

బదరీనాథ్ ఆలయాన్ని ఏడాదిలో ఆరు నెలలు మాత్రం తెరిచి ఉంచుతారు. మిగిలిన ఆరు నెలలు మూసివేస్తారు. అంటే మే నుంచి అక్టోబరు వరకు మాత్రమే బదరీనాథ్‌లో ఆలయం తెరిచి ఉంటుంది. అక్టోబరు నుంచి హిమాలయ ప్రాంతాల్లో విపరీతమైన మంచు కురవడం వల్ల బదరీనాథ్ ఆలయానికి రాకపోకలు కష్టం. అందుకోసం ఈ కాలంలో ఆలయాన్ని మూసివేస్తారు. ఈ ఆలయాన్ని మూసివేసిన రోజుల్లో బదరీనాథ స్వామి ఇక్కడకు 40కి.మీల దూరంలోని జోషిమఠ్‌లో పూజలందుకుంటాడు. 

జోషిమఠ్‌లోని బదరీనారాయణ ఉత్సవమూర్తికి పూజలు చేస్తారు. అంటే బదరీనారాయణుడు ఆరు నెలలు బదరీనాథ్‌లో, ఆరు నెలలు జోషిమఠ్‌లో పూజలందుకుంటాడన్నమాట. జోషిమఠ్‌లో బదరీనారాయణ ఆలయంతోపాటు పురాతన నరసింహస్వామి ఆలయం కూడా ఉంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top