మొటిమలు మాయం కావాలంటే...

-మొటిమలు ఉన్న వాళ్లు టమోటా గుజ్జును ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో ముఖం కడిగేయాలి.
 - మూడు టీ స్పూన్ల తేనెలో కొంచెం దాల్చినచెక్క పొడి కలిపి రాత్రి పడుకోబోయేముందు మొటిమలపై రాసుకోవాలి. ఇలా రెండు వారాలపాటు చేస్తే ఫలితం ఉంటుంది. 
- నిమ్మరసం, వేరుశెనగ నూనెల్ని సమపాళ్లలో కలిపి రాసుకోవాలి. నిమ్మరసంలో గంధంపొడి లేదా దాల్చిన చెక్క పొడి కూడా కలిపి మొటిమలపై రాసుకోవచ్చు.
 -నిమ్మరసం, రోజ్ వాటర్‌లను సమపాళ్లలో కలిపి మొటిమలపై రాసి అరగంట తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. నాలుగు వారాలపాటు ఇలా చేస్తే మొటిమలు తగ్గిపోతాయి.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top