శ్రీ మహాలక్ష్మికి, ఆమె అక్క జ్యేష్టాదేవికి ఎవరెక్కడ ఉండాలన్న విషయమై వాదోపవాదం జరిగింది. లక్ష్మీదేవి అలిగి వెళ్లి సముద్రంలో దాక్కుంది. అక్కయ్య జ్యేష్టాదేవి బయటికి రమ్మని పిలిచింది. ఇద్దరూ కలసి సమస్యను పరిష్కరించుకున్నారు. లక్ష్మీదేవి తాను ఎక్కడెక్కడ ఉండాలనుకుంటుందో చెప్పింది. వాటిల్లో పసుపు ఒకటి. నాటి నుంచీ పసుపును పవిత్రంగా భావించడం మొదలైంది. అందువల్లే శుభలేఖలకు, కొత్త చిట్టా పద్దుల పుస్తకాలకు పసుపు రాస్తారు. అలా స్మరించుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది, తమ జీవితం, వ్యాపారాలు వృద్ధి చెందుతాయని నమ్మకం.