ఇందులో ఆరోగ్యసూత్రం దాగి ఉంది. ఇంటి ముందు పడిన దుమ్ము, ధూళిని ఉదయాన్నే చీపురుతో చిమ్మి శుభ్రం చేసుకుంటాం. ఆ తర్వాత నేల మీద నీటిని చల్లితే నేల చల్లబడడంతోపాటు తేమ ఉన్నంత వరకు దుమ్ము పైకి లేవదు. ఈ ప్రక్రియ మనకు క్రీ.పూ నుంచి జరుగుతూనే ఉంది. అయితే ఇలా చల్లేది మామూలు నీరు కాకుండా ఔషధపూరితమైనదైతే మరింత ప్రయోజనం కదా! అలా అలవాటైనదే కళ్లాపి చల్లడం. కళ్లాపి అంటే గోమయం (ఆవు పేడ) కలిపిన నీరు. గోమయం సహజమైన క్రిమిసంహారిణి. దీనిని నీటిలో కలిపి ఇంటి ముందు చల్లడం వల్ల అనేక అంటువ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. ఆవులు తగ్గిపోవడంతో ఇప్పుడు గ్రామాల్లో కూడా గోమయం దొరకడం కష్టమవుతోంది. దాంతో కళ్లాపికి గేదె పేడ వాడుతున్నారు. కానీ గోమయం వాడకం ఆరోగ్యదాయకం.