కొంచెం పాలు తీసుకుని అందులో చిటికెడు పసుపు, రెండు చెంచాల గంధం పొడి కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మృతకణాలు తొలగిపోయి కాంతివంతంగా తయారవుతుంది. పావు చెంచా పాల పొడిలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి మర్దన చేయాలి. పది నిమిషాలు ఆగిన తరువాత చల్లటి నీళ్లతో కడిగి ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకుంటే చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కమలాఫలం తొక్కను ఎండబెట్టి పొడి చేసి అందులో తగినంత పెరుగు కలిపి మిశ్రమంలా తయారు చేసి ముఖం, మెడకు రాసుకుని పావు గంట అయ్యక కడిగేస్తే మేను నిగారింపు సొంతం చేసుకుంటుంది. రెండు చెంచాల నిమ్మరసంలో అరచెంచా తేనె కలిపి ఒంటికి రాసుకొని అరగంతయ్యాక స్నానం చేస్తే చర్మం తాజాగా కనిపిస్తుంది.