బుల్లి తెరపై సంచలనం సృష్టించిన ముద్దుగుమ్మ లాస్య ప్రస్తుతం సినిమాల్లో నటిస్తుంది. బుల్లి తెరకు పూర్తిగా దూరమైన ఈ అమ్మడు సినిమాలు చేస్తూనే మరో వైపు పెళ్లికి సిద్దమైంది. లాస్య పెళ్లికి సంబంధించి గతంలో పలు రకాలుగా పుకార్లు షికార్లు చేసిన విషయం తెల్సిందే. అయితే అవన్ని గాలి వార్తలే అని తేలిపోయింది. తాజాగా లాస్య నిశ్చితార్థం మరాఠి వ్యక్తి అయిన మంజునాధ్తో జరిగింది. హఠాత్తుగా ఊడిపడ్డ ఈ మంజునాధ్ ఎవరు అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది.
CLICKHERE : టాలీవుడ్ హీరోల ఎత్తు తెలిస్తే....షాక్
CLICKHERE : ఎన్టీఆర్ భార్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
CLICKHERE : టాలీవుడ్ హీరోల ఎత్తు తెలిస్తే....షాక్
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహారాష్ట్రలో బిగ్ షాట్గా తెలుస్తోంది. ముంబయిలో పలు వ్యాపారాలు మంజునాధ్ చేస్తాడని తెలుస్తోంది. వందల కోట్ల ఆస్తులకు మంజునాధ్ అధిపతి అన్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే మంజునాధ్కు లాస్యకు ఎక్కడ పరిచయం ఏర్పడ్డది అనేది మాత్రం తెలియరావడం లేదు.
మొత్తానికి లాస్య పెద్ద తలకాయనే పట్టిందంటూ టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మంజునాధ్ బాగా ఆస్తిపరుడు అవ్వడం వల్లే లాస్య కెరీర్ మంచి ఊపులో ఉండగా పెళ్లికి రెడీ అయ్యింది. తాజాగా నిశ్చితార్థం చేసుకున్న లాస్య త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కేందుకు సిద్దం అవుతుంది.