షాకింగ్: వేలానికి నాగార్జున కుటుంబ ఆస్థులు


టాలీవుడ్‌లో అక్కినేని కుటుంబం పేరు ప్రతిష్టల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అంతేకాదు పలు వ్యాపారాలు చేస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక ధనవంతులుగా పేరు తెచ్చుకున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం నాగార్జున బ్యాంకు లోను కట్టక పోవడంతో నోటీసులు అందుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున బ్యాంకుతో చర్చలు జరిపి ఆస్తులు వేలం వేయకుండా అడ్డుకున్నాడు. ఇక తాజాగా నాగార్జున సోదరి నాగ సుశీలకు బ్యాంకు నోటీసులు అందాయి. ఎస్‌బిహెచ్‌ (ఇప్పుడు ఎస్ బీఐ) బ్యాంకు నుండి అక్కినేని వారి ఇంటి ఆడపడుచు రెండు కోట్ల రూపాయలు రుణం పొందింది. ఆ రుణం ఆమె తిరిగి చెల్లించలేదు. విసిగిపోయిన బ్యాంకు అధికారులు పలు సార్లు నోటీసులు ఇచ్చారు. తర్వాత..

నాగ సుశీల ఆస్తులను వేలం వేయబోతున్నట్లుగా బ్యాంకు ప్రకటించింది. జూబ్లి హిల్స్‌లోని ఖాళీ స్థలం, ఓ విలువైన ఇంటిని నాగ సుశీల బ్యాంకుకు తాకట్టు పెట్టింది. వాటిని ఇప్పుడు వేలం వేయబోతున్నారు. అక్కినేని వారి కుటుంబ సభ్యులు ఇంతటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా లేక వారు బ్యాంకుకు ఎగనామం పెట్టాలని ఇలా ఆర్థిక ఇబ్బందుల నాటకం ఆడుతున్నారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఈ వ్యవహారం నాగార్జున కుటుంబ పరువును మరోసారి రచ్చకీడ్చింది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top