అరటిపండుతో ఇలా చేస్తే మెరిసే ముఖం మీ సొంతం

ఆటలో అరటి పండు అని దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాము. కానీ దాన్ని అంత తేలిగ్గా తీసి వేయలేము. ఎందుకంటే ముఖ సౌందర్యం, చర్మ ఆరోగ్యం కొరకు అరటి పండు ఒక మంచి సాదనం అని చెప్పవచ్చు.

బాగా పండిన అరటి పండును గుజ్జుగా చేసి అందులో రెండు స్పూన్స్ గట్టి పెరుగు లేదా ఓట్స్ పొడి వేసి బాగా కలిపి ముఖానికి,మెడకు బాగా పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయుట వలన మీ ముఖ సౌందర్యం పెరుగుతుంది.

అరటి పండు గుజ్జులో ఒక స్పూన్ పాలు లేదా తేనే కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా 20 నుంచి 25 రోజుల పాటు చేస్తే ముఖం మిలమిల మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది.

పొడి చర్మం కలవారు అరటి పండు గుజ్జులో గుడ్డు తెల్ల సోన,ఒక స్పూన్ క్రీం వేసి కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు మూడు సార్లు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

ముఖం మీద మచ్చలతో బాధపడేవారు అరటి పండు తొక్కతో మచ్చలు ఉన్న ప్రాంతంలో సున్నితంగా రుద్ది ఒక పావుగంట సేపు ఆరనివ్వాలి. అనంతరం ముఖాన్ని శుభ్రంగా కడగాలి. రోజు మొత్తం మీద వీలు అయినన్నిసార్లు ఈ విధంగా చేస్తే క్రమంగా మచ్చలు తగ్గుతాయి.

దంతాలు పసుపు పచ్చగా మారితే,అరటి తొక్కతో మీ దంతాల మీద బాగా రుద్దాలి. రోజులో కనీసం రెండు సార్లు చేసినట్లైతే మంచి పలితం కనపడుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top