Diabetes Diet:డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండు తింటే ఏమి అవుతుందో తెలుసా?

Diabetes Diet: డయాబెటిస్ ఉన్నవారు తీసుకునే ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు మామిడిపండు తినవచ్చా లేదా అనే విషయంలో మనలో చాలా మందికి సందేహాలు ఉంటాయి.

పచ్చి మామిడికాయ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.. అదే పండిన మామిడిపండు తింటే రక్తంలో చక్కర స్థాయిలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేవారు మామిడిపండు తినవచ్చని అది కూడా సరైన మొత్తంలో, సరైన సమయంలో, సరైన మార్గంలో మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

మామిడి పండులో 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు పండ్ల ద్వారా 30 గ్రాముల కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చని చెబుతున్నారు. పండు తిన్న చాలా మితంగా తినాలని డాక్టర్ సూచిస్తున్నారు. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తించుకోవాలి.

కార్బోహైడ్రేట్స్ అనేవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అయితే మామిడిపండులో ఉండే ఫైబర్ చక్కెర శోషణ రేటును పరిమితం చేయడానికి సహాయపడుతుంది. అందువల్ల మామిడి పండును లిమిట్ గా తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. అలాగే మామిడి పండు గ్రైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top