జీర్ణ సమస్యలతో బాధపడేవారు సాధారణంగా జీలకర్రను రెగ్యులర్గా తీసుకుంటారు. కొందరు జీలకర్రను నీటిలో మరిగించి ఆ నీటిని తాగుతారు. అలాగే, చాలామంది భోజనం తర్వాత ఆహారం జీర్ణం కావడానికి సోంపు తింటారు.
ఈ విధంగా చూస్తే, జీలకర్ర, సోంపు రెండూ జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే, ఈ రెండింటినీ కలిపి హెర్బల్ టీలా తయారు చేసుకొని తాగితే ఏం జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ దాని గురించి తెలుసుకుందాం.
జీలకర్ర, సోంపుతో తయారు చేసిన టీ ఒక శక్తివంతమైన ఆయుర్వేద మూలికా పానీయం. ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది, ముఖ్యంగా జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జీలకర్ర, సోంపులోని సహజ ఎంజైమ్లు గ్యాస్, అజీర్ణం, ఆమ్లత్వం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ టీ జీవక్రియను వేగవంతం చేసి, బరువు తగ్గాలనుకునేవారికి సహాయపడుతుంది. ఆకలిని నియంత్రించడంతో పాటు కడుపు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఇది తోడ్పడుతుంది.
జీలకర్ర, సోంపు రెండూ యాంటీఆక్సిడెంట్లు, డిటాక్స్ లక్షణాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. సోంపులోని పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఈ హెర్బల్ టీ మానసిక శాంతిని అందిస్తుంది. రాత్రి నిద్రకు ముందు తాగితే మంచి నిద్ర పట్టడమే కాక, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. దీనిలోని యాంటీ-బాక్టీరియల్ లక్షణాలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి, శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తాయి. అలాగే, మానసిక అలసట, ఏకాగ్రత లోపం, చిరాకు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
జీలకర్ర, సోంపుతో తయారైన ఈ టీ కడుపులో గ్యాస్, మంట, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. జీలకర్ర జీర్ణ ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది, సోంపు కడుపును చల్లబరిచి, శ్వాసను తాజాగా ఉంచుతుంది. ఈ టీ కడుపు నొప్పికి తక్షణ ఉపశమనం అందిస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.