ప్రదీప్ గురించి తెలియని షాకింగ్ నిజాలు

బుల్లితెరపై Pradeep యాంకర్ గా తనదైన శైలిలో దూసుకు పోతున్నాడు. ప్రదీప్ మొదట రేడియో మిర్చి లో RJ గా పనిచేసేవాడు. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలోనే బుల్లితెరలో యాంకర్ గా మంచి పేరు సంపాదించాడు. ప్రదీప్ ఇంజనీరింగ్ పూర్తీ కాగానే  ఈవెంట్ మేనేజర్ గా తన కెరీర్ ని ప్రారంభించాడు. ఒక లోకల్ చానల్ లో చేసిన యాంకరింగ్ ప్రదీప్ జీవితాన్నే మార్చివేసింది.  ఇక వెనుదిరిగి చూసుకొనే అవకాశాన్ని ఇవ్వకుండా ముందుకు దూసుకుపోయేలా చేసింది.  బుల్లితెరపై మొదటి మెల్ యాంకర్ గా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు. 



జీ తెలుగులో ప్రసారం అయిన 'గడసరి అత్త సొగసరి కోడలు' అనే మహిళ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యి, ఆ తర్వాత సినిమా ఆడియో వేడుకలకు యాంకరింగ్ చేస్తూ  తన హావాని కొనసాగిస్తున్నాడు. ఒక మహిళ షో కి ఒక మెన్ యాంకరింగ్ చేయటం అదే మొదటిసారి. అయిన షో ని చాలా బాగా చేసి ముఖ్యంగా మహిళల మన్ననలను పొందాడు. ప్రదీప్ యాంకరింగ్ తో పాటు నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు.  జీ తెలుగులో వస్తున్న 'కొంచెం టచ్ లో ఉంటే చెప్తా' అంటూ నిర్మాతగా కూడా సక్సెస్ సాధించాడు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top