ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య, దానికి సంబంధించిన ఒక అద్భుతమైన ఇంటి చిట్కాను పంచుకోబోతున్నాను. అదేమిటంటే.. ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య "కిడ్నీలో రాళ్లు" (Kidney Stones).
అసలు కిడ్నీలో రాళ్లు ఎందుకు వస్తాయి?
మన బిజీ లైఫ్ స్టైల్ వల్ల సరిగ్గా నీళ్లు తాగకపోవడం దీనికి ప్రధాన కారణం. అలాగే, వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు వీక్ అవుతున్నాయనే ఉద్దేశ్యంతో డాక్టర్ సలహా లేకుండా ఇష్టం వచ్చినట్లు క్యాల్షియం ట్యాబ్లెట్లు వాడటం వల్ల.. శరీరానికి తగినన్ని నీళ్లు, విటమిన్-డి అందక ఆ క్యాల్షియం కాస్తా కిడ్నీలో రాళ్లుగా మారుతుంది.
ఇది మాత్రమే కాకుండా, యూరినరీ ఇన్ఫెక్షన్లు (UTI), డయాబెటిస్ వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. కొంతమందికి వంశపారంపర్యంగా కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి.
రాళ్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు ప్రతి గంటకూ ఏదో ఒక ద్రవాహారం (కొబ్బరి నీళ్లు, తేనె నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ లేదా పండ్ల రసాలు) తీసుకుంటూ ఉండాలి. అలాగే వీరు ఆకుకూరలకు కాస్త దూరంగా ఉండటం మంచిది, ఎందుకంటే వాటిలో ఉండే 'ఆక్సలేట్స్' కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతాయి.
సర్జరీ లేకుండా కిడ్నీలో రాళ్లను కరిగించే అద్భుతమైన ఉలవల జావ:
కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలియగానే చాలా మంది భయపడి ఆపరేషన్ వైపు మొగ్గుచూపుతారు. కానీ, ఒక చిన్న ఇంటి చిట్కాతో వీటిని మనం సులువుగా కరిగించవచ్చు. అందుకు మనకు కావాల్సింది "ఉలవలు". అయితే, దీనిని ఒక కచ్చితమైన కొలతతో తయారుచేసుకోవాలి. అప్పుడే ఇది మందులాగా పనిచేస్తుంది.
తయారీ విధానం:
ముందుగా 200 గ్రాముల ఉలవలను తీసుకోండి.వాటిని 700 ml నీళ్లలో నానబెట్టండి.ఇప్పుడు ఈ నీటిని సన్నటి మంట మీద బాగా మరిగించాలి.
మనం పోసిన 700 ml నీళ్లు కాస్తా సరిగ్గా 190 ml కి చేరే వరకు (సుమారు 30 నుండి 40 నిమిషాల సమయం పడుతుంది) మరగబెట్టాలి. ఈ కొలత చాలా ముఖ్యం!
నీళ్లు 190 ml కి రాగానే పొయ్యి మీద నుండి దించి, ఉలవలను వడగట్టేయండి.
ఇప్పుడు ఆ 190 ml ఉలవల నీటిలో ఒక అర స్పూన్ (2.5 గ్రాములు) 'సైంధవ లవణం' (Rock Salt) వేసి బాగా కరిగేలా కలపండి.
ఎలా తాగాలి?
ఈ నీటిని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో.. ఒకేసారి అంతా తాగేయకుండా కొంచెం కొంచెం చొప్పున పదే పదే తాగుతూ ఉండాలి.
ఇలా చేస్తే వారం, పది రోజుల్లోనే చిన్న చిన్న రాళ్లు కరిగిపోయి మూత్రం ద్వారా సులువుగా బయటకు వచ్చేస్తాయి. ఒకవేళ రాళ్లు మరీ పెద్దగా ఉన్నా, లేదా గట్టిగా ఉన్నా సుమారు 40 రోజుల (మండలం రోజులు) పాటు ఈ చిట్కాను క్రమం తప్పకుండా డెడికేటెడ్ గా పాటించాలి.
మళ్ళీ భవిష్యత్తులో ఈ సమస్య రాకూడదు అనుకునేవారు, ప్రతిరోజూ ఒక రెండు కప్పుల ఉలవల నీటిని తాగడం అలవాటు చేసుకుంటే కిడ్నీలో రాళ్లను పూర్తిగా నివారించవచ్చు.
చూశారు కదా! మన వంటిల్లే మనకు అతి పెద్ద మెడికల్ షాప్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ చిట్కాను మీరు కూడా పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


